మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిషత్ కార్యాలయంలో వాడబలిజ మత్స్యకార సంఘం ఆధ్వర్యం లో కన్నాయిగూడెం మండలం వైస్ ఎంపీపీ,ఆదర్శ కీర్తి జాతీయ అవార్డు గ్రహీత బొల్లె భాస్కర్ ను వాడ బలిజ జిల్లా గౌరవ అధ్యక్షులు గార ఆనంద్,మండల అధ్యక్షుడు గార పోషాలు,జిల్లానాయకులు కలలా రాంబాబు,బొల్లె ఆదినారాయణ,గార మహేష్, తోట మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వాడ బలిజ జిల్లా గౌరవ అధ్యక్షులు గార ఆనంద్ మాట్లాడుతూ వాడ బలిజ వర్గానికి చెందిన భాస్కర్ కు జాతీయస్థాయి అవార్డు రావడం ఆనందంగా ఉంది అని భాస్కర్ కరోనా కష్ట కాల సమయంలో ఏజెన్సీలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆయన చేసిన ఎనలేని సేవలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా భాస్కర్ సేవలను గుర్తించిన ఆదర్శ కళానిలయం సంస్థవారు అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది తీర ప్రాంతాలలో గోదావరి నదికి ఇరువైపులా ఉంటూ చేపలవేట వారి ప్రధాన వృత్తిగా ఎంచుకునే ఉన్న వాడబలిజ లు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని అన్నారు.ప్రభుత్వం వీరికి వెంటనే వాడబలిజ మత్స్యకార బందును వర్తింప చేస్తూ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అల్లి నర్సింగరావు, బొల్లె దుర్గాప్రసాద్,గార నాగేశ్,గార చందు,గార అచ్యుత్,బొల్లె చంద్రశేఖర్,బొల్లె కృష్ణ బాబు, తోట తిరుమల రావు,బొల్లె రాంబాబు,అంబరీ కానీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: