గుండాల ఆగస్ట్ 15 (మన్యం మనుగడ) ఘనంగా మండలంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో రంగు రమేష్ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముక్తి సత్యం, పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీనివాస్, ఫారెస్ట్ కార్యాలయంలో మురళి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం కిషన్, స్థానిక కోపరేటివ్ సొసైటీలో చైర్మన్ రామయ్య, జెండాను ఎగరవేశారు. వీరితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మరియు పాఠశాలలు బ్యాంకుల వద్ద సంబంధిత అధికారులు జండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సీతారాములు, మరియు మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు
Post A Comment: