మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని పాత రెడ్డిపాలెం ఏం రెడ్డి పల్లి గ్రామాల సరిహద్దుల్లో గల ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రకృతి వనం పెంచడానికి పూనుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం రోజున పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రకృతి వనం లో మొక్కలు నాటారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, పంచాయతీల సర్పంచులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: