మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వారు తాడ్వాయి కస్తూరిభాగాంధి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సునార్కని అశ్విని కి ఇండియన్ ఆయిల్ తరుపున తల్లిదండ్రులు లేని ఆనాధ పిల్లలకు స్కాలర్ షిప్ గా 10.000 రూపాయలు చెక్కును చిన్నబోయినపల్లి పెట్రోల్ పంప్ వారి ఆధ్వర్యంలో అందజేశారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కస్తూరి భాగాంధి పాఠశాల ఎస్.ఓ పుస్పనీలా మరియు స్థానిక ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బాగా చదువుకోవాలి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి ఉన్నత చదువులు చదివి ఉన్నత విద్యవంతురాలివి కావాలని విద్యార్థిని కి తెలిపారు.సమయంలో రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్న పేదఇంటి ఆనాధ అమ్మాయికి ఇండియన్ ఆయిల్ వారు స్కాలర్ షిప్ గా పదివేల రూపాయల ఇవ్వడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఇండియన్ ఆయిల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: