మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచలు మరియు కార్యదర్శిలతో మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ వివేక్ రామ్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివరణకు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బూర్గంపాడు జడ్పీటీసీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.
అనంతరం జడ్పీటీసీ శ్రీలత మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీల్లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్త చెదారం,రోడ్లపై అస్తవ్యస్తంగా మురికినీరు నిల్వ ఉండటంతో.. వీటి ఫలితంగా దోమలు విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.కావున ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రం చేసి,రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆయా సర్పంచులకు,సెక్రటరీలకు సూచించారు.కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరమైన డెంగీ, మలేరియా,టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల బారిన పడి ఇంటికొకరు మంచాన పడ్డారని వారిని దృష్టిలో పెట్టుకొని ప్రతీ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా బ్లీచింగ్ చల్లి,హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచులు, సెక్రటరీలు,ఎంపిఓ,ఎంపీడీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: