CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు చేరుకున్న పోడు యాత్ర...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పోడు సాగు దారులకు మద్దతుగా సిపిఐ పార్టీ చేపట్టిన పోడు యాత్ర శనివారం జూలూరుపాడు కు చేరుకుంది. సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో పోడు సాగు దారులకు మద్దతుగా బారి ర్యాలీ నిర్వహించారు. అనంతరం యల్లంకి గార్డెన్ లో నిర్వహించిన పోడు యాత్ర సభలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మరియ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పోడు రైతుల సమస్యలను తీరుస్తానన్న కెసిఆర్ ఇప్పుడు పోడు రైతులపై కేసులు పెట్టి ఫారెస్ట్ అధికారులతొ దాడులు చేపిస్తున్నారని అన్నారు. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు రైతుబంధు పథకం అమలు చేయాలని, పోడు రైతులకు భీమా వర్తింపజేయాలని, డిమాండ్ చేశారు. కోనంనేని మాట్లాడుతూ.. కెసిఆర్ ఎన్నికలల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోడు రైతులపై పెట్టిన కేసులను కొట్టివేయాలని, కోరారు. పోడు సాగుదారులు తమ పొలాల్లో పంటలు వేసుకోవచ్చని,పిలుపునిచ్చారు. వీరి సమక్షంలో సిపిఐ పార్టీలో చండ్ర నరేంద్ర కుమార్, తన అనుచరులతో పార్టీలో చేరారు.చాడా వెంకటరెడ్డి సాంబశివరావులు నరేంద్ర కుమార్ ను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు సాబీర్ పాషా, జూలూరుపాడు మండల సమితి నాయకులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఎల్లంకి మధు, చింతా స్వరాజ్యరావు, షేక్ నాగుల్ మీరా, చాంద్ పాషా, సీతయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: