CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు రుణ మాఫీ ఏక కాలంలో చేయాలి

Share it:

 


*బ్యాంక్ అధికారులు  రైతుల ఖాతాలను హోల్డ్ ల నుండి తొలగించాలి.

*వ్యవసాయ అధికారులు రైతులకు సకాలంలో పిండి(మందు)బస్తాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.

*కిసాన్ కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను నట్టేట ముంచిన పరిస్థితి ఈ రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితి ఉందని రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో  రైతు రుణమాఫీ చేయాలని బ్యాంక్ అధికారులు రైతుల ఖాతాలను హోల్డ్ లో పెట్టి రైతుల ఇబ్బందులు పెట్టడం సబబు కాదని,రైతుల ఖాతాలను హోల్డ్ ల నుండి తొలగించక పోతే బ్యాంక్ ల ఎదుట రైతుల పక్షాన ధర్నాలు చేస్తామని ఆయన అన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా  రైతులకు సకాలంలో పిండి (మందు)బస్తాలు అందించే విధంగా వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: