మాన్యం టివి దుమ్ముగూడెం:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంబించిన దళితబంధు పధకం కేవలం దళితులకు మాత్రమే వర్తింపచెయ్యాలని ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మరియు కలెక్టర్ కార్యాలయం లోని డిఆర్వో కి విశ్వహిందూ పరిషత్ జిల్లా కమిటీ సభ్యులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది, మన జిల్లా లో దళితులలో సుమారు 90 శాతం మంది క్రైస్తవం స్వీకరించారని వారంతా భారత రాజ్యాంగం ప్రకారం బి సి-సి లు గా పరిగణించబడతారనీ కానీ వారంతా ప్రభుత్వాలను మోసం చేస్తూ, రాజ్యాంగ స్పూర్తి కి విఘాతం కలిగిస్తూ తప్పుడు యస్ సి సర్టిఫికేట్ లు పొంది అక్రమంగా రిజర్వేషన్ లు అనుభవిస్తూ రెండవ వైపు మైనారిటీ హోదా ను కూడా అనుభవిస్తున్నారని, కావునా ప్రభుత్వం ప్రారంబించిన దళిత బందు కూడా దళితులకు కాకుండా క్రిస్టియన్ మైనారిటీ లకు మేలు చేసే పధకం లా ఉందని అలా జరగకుండా కేవలం నిజమైన దళితులకు (హిందూ) మాత్రమే ఈ పధకం వర్తించేలా అన్నీ మండలాలలోని తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చి, నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసేటప్పుడు తప్పకుండా వారు నిజమైన దళితులా లేదా క్రిస్టియన్ మైనారిటీలా అనేది విచారించి నిజమైన దళితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోగలరని కలెక్టర్ గారిని కోరటం జరిగింది, ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, జిల్లా సహ కార్యదర్శి జెట్టి వెంకట్రాజు, జిల్లా కోశాధికారి యంవికెవి శర్మ, జిల్లా సామాజిక సమరసతా ప్రముఖ్ కూరపాటి రవీందర్, కొత్తగూడెం ప్రఖండ కార్యదర్శి సిరా చిరంజీవి తదితర కార్యకర్త లు పాల్గొన్నారు.
Post A Comment: