CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగాను విమర్శిస్తే సంహించేది లేదు - హద్దుమీరి మాట్లాడితే తగిన బుద్ది చెప్తాం

Share it:

 



పినపాక : 


తెలంగాణా ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి మీద అనవసర విమర్శలు చేసినా, హద్దుమీరి మాట్లాడిన కాంగ్రెస్‌ నాయకులకు తగిన బుద్ది చెప్తామని టీఆర్ఎస్‌ విద్యార్ది విభాగం మండల అధ్యక్షుడు యాంపాటి సందీప్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ...

పినపాక నియోజకవర్గం అభివృద్ది పధంలో ముందుకు పోతుందన్నారు. కేవలం రేగా కాంతారావు గారికి ఉన్న పట్టుదలతోనే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు మంజూరు, మణుగూరు పట్టణంలో పలు అభివృద్ది పనులు మంజూరు, భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌లో భూ నిర్వాసితులకు ఒకేసారి 309 మందికి పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇప్పించడం కేవలం రేగా కాంతారావు గారి పట్టుదలతోనే సాధ్యమయ్యయన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది తెలుసుకోకుండా రేగా కాంతారావు గారిపై హద్దుమీరి మాట్లాడితే అందుకు తగిన విధంగా ప్రతి చర్య ఉంటుందన్నారు. కేవలం గ్రామ స్దాయి కాంగ్రేస్‌ నాయకులు విమర్శిస్తే సంహించేది లేదని ప్రజలు రానున్న రోజుల్లో సరైన బుద్ది చెప్తారన్నారు.

Share it:

Post A Comment: