CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

✍️రమ్యను చంపిన హంతకున్ని ఉరి తీయాలి - బి.ఎస్.ఐ

Share it:


✍️కొవ్వొత్తులతో ఘనంగా కన్నీటి నిర్వాణం

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 19 (మన్యం మీడియా)

స్వాతంత్ర్య దినోత్సవ రోజునే నడిరోడ్డుపై ఓ బాలికను అత్యంత కిరాతకంగా పొడిచి చంపిన హంతకున్ని బహిరంగ ఉరితో కఠినంగా శిక్షించాలని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా కార్యదర్శి కొచ్చెర్ల కమళా రాణి, జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాస రావులు కోరినారు.

స్థానిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ప్రకృతి ఆశ్రమంలో బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా కోశాధికారి రొడ్డా పద్మావతి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు ఇరువురు మాట్లాడుతూ ఓవైపు దేశమంతా స్వాతంత్ర్య వేడుకల్లో ఆనందంగా ఉంటే అదే రోజున నడిరోడ్డుపై ఓ బాలికను మృగం లా వేటాడి తరిమి తరిమి పొడిచి చంపిన తీరు గుండెను పిండేలాగా మానవ సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని భారతావనిలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందనడానికి ఈ సంఘటన మరో సాక్ష్యంగా నిలుస్తోంది అని, ఆవేదన వ్యక్తంచేశారు.తరతరాలుగా స్త్రీ లకు రక్షణ లేకుండా పోయిందని ఎన్ని చట్టాలు ఉన్నా స్త్రీలను కాపాడలేక పోతున్నాయి అని, ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే హంతకులను బహిరంగ ఉరితో కఠినంగా శిక్షించాలని అన్నారు.అనంతరం కొవ్వొత్తులు వెలిగించి రమ్యకు ఘనంగా కన్నీటి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమానికి బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా కోశాధికారి రొడ్డా పద్మావతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాస రావు బి ఎస్ ఐ జిల్లా కార్యదర్శి కొచ్చెర్ల కమళా రాణి, అరుణ, దేవనపల్లి రమేష్, వీరేష్ , శ్రీనివాస్, కృష్ణయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.*

Share it:

Post A Comment: