చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : టిఆర్ఎస్ పాలనలో ప్రజలకు వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజా ప్రతినిధులు నాయకులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ భానోత్ పార్వతీ మాట్లాడుతూ మండల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలం లో ఉన్న ప్రతి ఒక్కరు కి కూడా సంక్షేమ పథకాల అందిస్తానని తన యొక్క పాత్రను సమర్థవంతంగా పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ భోజ నాయక్, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఎంపీటీసీ దారా బాబు, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: