CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి గూడెం లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

Share it:

 


                

తుడుం దెబ్బ మండలాధ్యక్షుడు పోడెం శోభన్. 

 మన్యం టీవీ ఏటూరునాగారం             ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 న  ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గూడెం లో ఘనంగా జరుపుకోవాలని తుడుందెబ్బ ఏటూరునాగారం మండల అధ్యక్షులు పొడెం శోభన్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఆదివాసి గూడెం లో ప్రతి గ్రామం లో మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. కొమరం భీమ్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం ఆదివాసీలు నిరంతరం పోరాడుతూ మన హక్కులు కొట్లాడి సాధించుకోవాలని అన్నారు. మన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తోంది. ఆదివాసీలు అందరు ఒక తాటిపైకి వచ్చి ఐక్యంగా ఉద్యమాలు చేయాలని అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు విష్ణు, కార్తీక్,శ్రీకాంత్, నరేష్,భాస్కర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: