మన్యం టీవీ పాల్వంచ:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతాల బోరు గ్రామపంచాయతీలో పంచాయతీ కార్మికుడి గా పనిచేస్తున్న మల్లూరు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది.మల్లూరి మృత దేహం కు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గూడెపూరి.రాజు సిఐటియు జెండా కప్పి నివాళులర్పించారు.అనంతరం సిపిఎం పార్టీ దంతాలబోరు ఎంపీటీసీ కొండబోయిన నాగమణి మరియు సిపిఎం పార్టీ పాల్వంచ మండల కార్యదర్శి కొండబోయన వెంకటేశ్వర్లు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నిరంతరం అండగా ఉంటామని తెలియజేస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు రాజు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుడు కి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పూర్ణ లింబా నాయక్,బిక్షం,చిట్టిబాబు,
రాయల్.అనసూర్య మరియు స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: