మన్యం, అశ్వాపురం:అశ్వాపురం మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల మల్లారెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి మృతి చెందటంతో నామా జగదీశ్వర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించు మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి కుమారుడి మృతి వివరాలు తెలుసుకొని తన ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ ముత్తినేని సుజాత, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, ఉప సర్పంచ్ సుధీర్, వైస్ ఎంపీపీ వీరభద్రం, టీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, ముత్తినేని వాసు, జాలె రామక్రిష్ణ రెడ్డి, మన్మథరెడ్డి, చావా వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: