CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి...

Share it:

 




మన్యం టీవీ దుమ్ముగూడెం ఆగస్టు 8 : మండలంలోని లక్ష్మీ నగరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన పార్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యే పొదేం.వీరయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. అభివృద్ధి, సంక్షేమపదకాల అమలులో దేశానికే ఆదర్శంగా పాలన చేస్తున్న తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిపై భద్రాచలం ఎమ్మెల్యే పొదేం. వీరయ్య అనుచితంగా హేళనగా మాట్లాడటం తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని,తక్షణమే ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పి,తన మాటలు వెనక్కి తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షులు అన్నె.సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు,రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేని గుడ్డివాళ్లు ఎమ్మెల్యే నియోజకవర్గంలో 6 నెలలు కోసారి కూడా పర్యటించన ఎమ్మెల్యే నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే ముఖ్యమంత్రి ని విమర్శించడం విడ్డూరంగా ఉందని,సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నష్టపరిహారం ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు మాట్లాడని కాంగ్రెస్, సీపీఎం నాయకులు రాజకీయ లబ్ధికోసం ఇప్పుడు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు..3 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాని ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు.వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా రాజకీయ లబ్ధికోసం అదుపుతప్పి మాట్లాడితే టిఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని,హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ తెల్లం. సీతమ్మ , ఎంపీపీ రేసు. లక్ష్మి , అధికార ప్రతినిధి ఎండీ జానీ పాషా , ఎంపీటీసీ మడకం రామారావు మండల కార్యదర్శి రమేష్ సొసైటీ డైరెక్టర్ పూర్ణయ్య, సీనియర్ నాయకులు కొత్తూరి సీతరామారావు, కణితి రాముడు, దామెర్ల శ్రీనివాస్, జయసింహా, రాంజిత్, శేఖర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: