మన్యం మనుగడ, మణుగూరు: మణుగూరు కోవిడ్ సెంటర్లో పని చేసిన వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను వైఎస్ఆర్ టిపి పార్టీ రాష్ట్ర నాయకులు కొల్లు వెంకట్ రెడ్డి, వైయస్సార్ టిపి మహబూబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ గాదె వెంకటరెడ్డి, మణుగూరు మండల నాయకులు ఉప్పల్ రెడ్డి, పినపాక మండల నాయకులు బ్రహ్మారెడ్డి, అశ్వాపురం నాయకులు వై వి పురుషోత్తం, బూర్గంపాడు మండల నాయకులు దుర్గ్యాల వెంకటేశ్వర్లు, స్థానిక రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంగీలాల్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు మణుగూరు ఏరియా నాయకులు ఎండీ గౌస్ మాట్లాడుతూ కోవిడ్ సెంటర్ వర్కర్ల జీతాలు చెల్లించకుండా ఇంకా ఎంత కాలం నిర్లక్ష్యం వహిస్తారు అని అధికారులను ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు కళ్లు తెరిచి వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారికి వెంటనే జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి రాణి, ఈ భారతమ్మ, ఈ మంగమ్మ,జానకి, మహాలక్ష్మి రాంబాయమ్మ రాములు శైలజ శ్రీరాములు తిరుమలరావు జయమ్మ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: