👉 వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
మన్యం టివి:ములకలపల్లి మండలం; కొత్తగూడెం సింగరేణి గెస్ట్ హౌస్ లో పినపాక ఎమ్మెల్యే తెలంగాణ చీఫ్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు ములకలపల్లి,జగన్నాధపురం గ్రామపంచాయతీ కార్మికులు వినతిపత్రం ఇచ్చారు,ఈ సందర్బంగా వారు పంచాయతీ కార్మికులకు 30 శాతం పిఆర్సి ఇవ్వాలని,పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని,పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ చెల్లించాలని,గుర్తింపు కార్డులు ఇవ్వాలని,కనీస వేతనం రూ 18000 చెల్లించాలని,వినతిపత్రం ఇచ్చి వారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో,మహమ్మద్ యూసుఫ్,గంటా శ్రీనివాసరావు,దొంతుల సత్యం,కొరస ప్రసాద్,కనకం మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: