మొరుమురు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసిన జే .ఈ సుధాకర్ 19- 8/ 2021 నాడు కరోనా మహమ్మారి తో మరణించారు వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు గ్రామపంచాయతీ ప్రాంగణం సుధాకర్ గారికి సంతాపసూచకంగా గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు మొరుమురు సర్పంచ్ పూసం నరేష్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి చీడెం నరేష్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు ఈ సంతాప సభ లో సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ సుధాకర్ సార్ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా వచ్చి ఎన్నో అభివృద్ధి పనులకు మార్గదర్శకాలు సూచించినారు అలాంటి వ్యక్తి కరోనా మహమ్మారి తో మృతి చెందడం చాలా బాధగా ఉందని ఆయన అన్నారు అలాగే సంతాప సభ కార్యక్రమానికి హాజరైన అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అందరు కూడా సుధాకర్ సార్ చేసిన సేవలను గుర్తు చేసుకుని కన్నీటి పర్వం అయినారు అంతకుముందు సుధాకర్ సార్ చిత్రపటానికి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు సర్పంచ్ పూసం నరేష్ పంచాయతీ కార్యదర్శి చీడెం నరేష్ ఉప సర్పంచ్ గౌరవ రపు కోటేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ వాజేడు మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల శ్రీనివాస్ చెన్నం స్వామి తదితరులు పూలమాలవేసి సుధాకర్ సార్ కు నివాళులర్పించారు.
Navigation
Post A Comment: