మన్యం టీవీ పాల్వంచ:-
వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీలోని నర్సింహసాగర్ గ్రామంలో ఆదివాసులు మాట్లాడుతూ ఈరోజు ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆదివాసుల అంతా ఘనంగా జరుపుకుంటారని.ఈ ఆదివాసులకి ఎన్నో ప్రత్యేకమైన చట్టాలు,హక్కులు కల్పించబడినప్పటికీ వీటిని అమలు చేయడంలో అధికారులు ద్వంద వైఖరి చూపడం చాలా బాధాకరమైన విషయం.మరియు 1/70,యల్.టి.ఆర్,పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాలనే వేడు
కుంటున్నారు.మరియు కొమరం భీమ్ ఆశయాల కోసం ప్రతి ఆదివాసి బిడ్డ నడుం బిగించి ముందుకెళ్లాలని,జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసిబిడ్డల కోసం అమరులైన అమరవీరులను ప్రతి ఆదివాసి బిడ్డ ఈరోజు స్మరించుకుంటారు.ఈ కార్యక్రమంలో వాసం.మంగయ్య వాసం.రుద్ర(సర్పంచ్ ),వజ్ర వీరయ్య(ఎంపీటీసీ),కొర్సా మల్లేష్, పడిగే శ్రీను ,వజ్జా.వెంకటేశ్వర్లు(మాజీ సర్పంచ్ ),వజ్జా.నరేష్(ఉప సర్పంచ్),పూనెం.కృష్ణ, కొర్స.వెంకటేశ్వర్లు,శర్ప.సురేష్ రామకృష్ణ,జానకిరామ్ కాక.సురేష్,కాలం.పెద్దబాబు,రాజు, పాయ.నాగార్జున్,వజ్జా. పద్మ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: