◆ ప్రధాన రహదారి పై కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం◆
● కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ మహిళా యూత్ విభాగం జనరల్ సెక్రటరీగా బానోత్ లతా నాయక్ నియామకం●
మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం :: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కోరంపల్లి చెన్నారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అశ్వారావుపేట నియోజకవర్గం యూత్ కమిటీ సమీక్షా సమావేశానికి కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కమిటీ అధ్యక్షులు గురజాల వెంకట్, ఉపాధ్యక్షులు పసుపులేటి వీరబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి బానోత్ లతా నాయక్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ మహిళా యూత్ విభాగం జనరల్ సెక్రటరీ గా నియమించారు. నియామక అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇవ్వవలసిన నిరుద్యోగ భృతి మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ధర్నా నిర్వహించి, ప్రధాన రహదారి పై కేసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించని పక్షంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో నాయకులు పాలకుర్తి సుమిత్, పాలకుర్తి రవి, కుంజా వెంకట్, భాను కుమార్, జగన్నాధపురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సున్నం బాలకృష్ణ, ఎండి జహీరుద్దీన్, తాళ్ల చంటి, నాగు, పాష , తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: