మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తాడ్వాయి సర్పంచ్ సునీల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ని బెల్లీ గణేష్, కోర్ని బెల్లీ శివయ్య,తాడ్వాయి మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసయ్య, సిద్దబోయిన సురేందర్, ఆదివాసి ఉద్యోగుల సంఘం నాయకులు తుడుం దెబ్బ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: