మన్యం టివి: ములకలపల్లి మండలం:సీతాయిగూడెం గ్రామ పంచాయతీలో మల్టిపర్పస్ కార్మికునిగా గా పనిచేస్తున్న సున్నం వీరస్వామి పెద్ద కర్మ కు సిఐటియు మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు మరియు గ్రామపంచాయతీ కార్మికులు హాజరైవారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా వారి కుటుంబానికి సిఐటియు ఆధ్వర్యంలో వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామపంచాయతీ నుండి వారి కుటుంబానికి రావలసిన వేతనాలు,మరియు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేవిదంగా అధికారులతో మాట్లాడతానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కుంజ శ్రీను, సున్నం వెంకటేష్ మరియు పంచాయితీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: