చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్త తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం మెడికల్ ఆఫీసర్ గీత అన్నారు. శుక్రవారం చండ్రుగొండ గ్రామంలో విస్తృతంగా పర్యటించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీజనల్గా వచ్చే జ్వరాలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవటంతో,పాటు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎవరికివారు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇమాన్, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: