అశ్వాపురం జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణ గోపాల కృష్ణారెడ్డి
జ్వరం వస్తే,ప్రభుత్వ వైద్యులు ను సంప్రదించాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి
మన్యం టీవీ,అశ్వాపురం:మండల ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అశ్వాపురం జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ గోపాల కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు డెంగ్యూ, టైఫాయిడ్, మల్లేరియా జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇంటి అవరణలో పాత వస్తువులలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆమె తెలిపారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి అవి కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరాలు వస్తాయన్నారు. డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నయని ప్రజలు వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీ లలో ప్రతి గ్రామంలో వైద్య శాఖ అధికారులు హెల్త్ క్యాంపు లు నిర్వహించాలన్నారు. ఎవరైనా జ్వరం వస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని ఆమె సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు.
Post A Comment: