మన్యం మనగడ ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం ,తో గూడెం గ్రామాల మధ్య జరిగిన ప్రమాదంలో తండ్రి కొడుకులు గాయాలపాలయ్యారు. ప్రత్యేక సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తో గూడెం పంచాయతీ గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన పవన్ అనే వ్యక్తి తన కుమారునితో కలిసి చక్ర వాహనం పై వస్తుండగా ఎద్దును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలియవచ్చింది. 108 వాహనం ద్వారా పినపాక ప్రాథమిక కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం
Post A Comment: