మన్యంటీవీ, అశ్వారావుపేట:అశ్వారావుపేట మండలం లోని తిరుమల కుంట గ్రామంలోని పలు కుటుంబాలను అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి మరియు అశ్వారావుపేట మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్, సోమవారం పరామర్శించారు. తిరుమల కుంట గ్రామానికి చెందిన పార్టి కోసం అహర్నిశలు కష్టపడిన మొదుము పరపు శ్రీనివాస్ ఇటివల అనారోగ్యం వలన మృతి చెందారని తెలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి పార్టిలో మంచి భవిష్యత్తు వున్న వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరం అని వారి చిత్రాపటానికి పూల మాలలు వేసి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన మామిడి కుమారి అనారోగ్యంతో మృతి చెందారని వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగె ఇటీవల వివాహం చేసుకున్న సాధు పాండురంగ రావు కుమార్తె అల్లుడిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు నారాయణ పురం రైతు కమిటీ మెంబర్ చిన్నం శెట్టి వెంకట నరసింహం, తిరుమల కుంట మాజీ సర్పంచ్ సున్నం రామ లక్ష్మయ్య, ఉప సర్పంచ్ జుజ్జూరి రాంబాబు, మొడియం సూర్యచంద్రరావు, ఆసుపక సర్పంచ్ కొనుసోతు లింగయ్య, మరియు పల్లెల రామ లక్ష్మయ్య, బోల్లుకొండ చెన్నరావు, బొడ్డు సత్తిబాబు, మనోహర్ మరియు గ్రామ పెద్దలు కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.
Post A Comment: