👉హారతితో స్వాగతం పలికిన ఆడపడుచులు
👉దారి పొడవునా పూల వర్షం కురిపించి అభిమానాన్ని పంచుకున్న యువకులు
✍️మేకల మహేష్ యాదవ్,మన్యం మనుగడ ప్రతినిధి.
మన్యం మనుగడ, మణుగూరు:
వారి ఇ ఏళ్లనాటి కల సాకారమైంది ఆ కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది వారి కల నెరవేరిన వేళ చెప్పలేని సంతోషం తన సంతోషానికి కారణమైన ఆ మహా నేతకు తిలకం దిద్ది ఘన స్వాగతం పలికిన ఆడపడుచులు వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మణుగూరు మండలాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి భూమి కోల్పోయిన 346 మంది భూ నిర్వాసితులకు బుధవారం నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా 7 ఏళ్ల కల సాకారం అయిన వేళ తమకు అన్ని విధాలా అండగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు నిర్వాసిత కుటుంబాల మణుగూరు మండలం సాంబయ్య గూడెం లో ఘన స్వాగతం పలికారు. వేలాది మంది ర్యాలీలో ఉత్సాహభరితంగా పాల్గొన్నారు సుమారు ఈ ర్యాలీ రెండు గంటల పాటు కొనసాగింది ఈ సందర్భంగా రేగా కాంతారావు ర్యాలీకి వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు స్థానిక యువకులు బాణాసంచా కాల్చి నేడే దివాళి వచ్చిందా అన్న సంతోషంగా ర్యాలీని ముందుకు నడిపించారు
Post A Comment: