CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ

Share it:

 



 మన్యంటీవీ, అశ్వారావుపేట: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తలపెట్టిన, దళిత బందు పథకాన్ని చేపట్టిన సంధర్భంగా ఈ రోజు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి అధ్వర్యంలో దళితులు కేసీఆర్ చిత్రా పటానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళితుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణా దళిత బందు పథకాన్ని నేడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గం సాలపల్లి లో ప్రారంభిస్తున్న సంధర్భంగా కెసిఆర్ దళితుల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి పాలాభిషేకం చేయటం జరిగిందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు అశ్వారావుపేట మండల తెరాస పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, నారాయణ పురం రైతు కమిటీ మెంబర్ చిన్నం శెట్టి వెంకట నరసింహం, సొసైటి డైరెక్టర్ నిర్మల పుల్లారావు, నారాయణపురం సర్పంచ్ కంగల పరమేష్, పేరాయి గూడెం వార్డు మెంబర్ చిప్పన పల్లి శ్రీను, నార్లపటి రాములు, కాలపాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: