మన్యం టీవీ కొత్తగూడెం, ఆగస్టు7:-
కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పెద్ద కుమారుడు కాపు జినిత్ పుట్టినరోజు వేడుకలను పారిశుద్ధ కార్మికుల తో జరుపుకోవడం జరిగింది. దీని అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నాకు అందరికన్నా పారిశుద్ధ కార్మికులు ముఖ్యమని వాళ్లు నాకు మొదటి ప్రాధాన్యత అని వాళ్ళందరూ చల్లగా ఉండటమే ముఖ్యమని కొత్తగూడెం మునిసిపాలిటీని శుభ్రంగా ఉన్నది అంటే వారే కారణం అన్నారు.
కొత్తగూడెం పురపాలక సంఘం పరిధి మొత్తం పరిశుభ్రత ఉండడానికి జవాన్లు మరియు పారిశుధ్య కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో తన చిన్న కుమారుడు కాపు నవనీత్, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వీరభద్రా చారి, మున్సిపల్ జవాన్లు పారిశుద్ధ కార్మికులు పాల్గొనరు.
Post A Comment: