చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో ఎంపీపీ భానోత్ పార్వతి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జయశంకర్ సార్ అని ఆయన చూపిన బాటలో మనమంతా పయనించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మాలోత్ బోజ్జ నాయక్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఎంపీటీసీ దారాబాబు, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీ ఓ తోట తులసి రామ్, ఏపీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: