CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆపదలో అన్నగా శ్రీ నృసింహ సేవావాహిని....బృందం

Share it:

 




మాన్యం టివి దుమ్ముగూడెం,ఆగస్ట్ 3,: మండలంలోని కొత్త దుమ్ముగూడెం గ్రామానికి చెందిన గద్దల రత్తమ్మ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్నారు.కుటుంబ సభ్యులు ఇప్పుడున్న కరోనా కష్ట కాలంలో కూడా దొరికిన కాడికి అప్పులు చేసి హాస్పిటల్ లో చూపించారు. రోజురోజుకు ఆర్థిక ఇబ్బందులు పెరగడం తో ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నారని దుమ్ముగూడెం మండల నృసింహ సేవా వాహిని బాధ్యులు గద్దల కృష్ణ ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ నృసింహ సేవావాహిని బృందం మంగళవారం కొత్తదుమ్ముగూడెం గ్రామం వచ్చి రత్తమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని,మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. తక్షణ సహాయం గా కొంత ఆర్థిక చేయూతనిచ్చి,25కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆపద లో ఉన్న అభాగ్యులకు చేయూతనిచ్చి సేవ చేసుకునే అదృష్టం ఆ భగవంతుడు మాకు ప్రసాధించినందుకు చాలా ఆనందంగా ఉన్నదని, మా ముందున్న లక్ష్యం హరిజన,గిరిజన గ్రామాల ప్రజలను చైతన్యవంతం చేసి ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చి, ఆర్తులకు ఎల్లవేళలా కొండత అండగా నృసింహ సేవావాహిని బృందం ఉంటుందని అన్నారు. సంస్థ సభ్యులు శ్రీధర్ మాట్లాడుతూ రత్తమ్మ కు చేయూతనివ్వడానికి ఇంకా దాతలు ముందుకు రావాలని ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ భగవంతుడు కి చేసినట్లే నని అన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య, శ్రీధర్, వార్డ్ మెంబర్ రమేష్ గద్దల కృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: