మన్యం టీవీ మంగపేట.
తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో మమేకమై జీవిస్తున్న దళితులను విస్మరించడం సరికాదని ములుగు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కర్రి శ్యాం బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు నియోజకవర్గంలోని దళితులు పార్టీలకతీతంగా సీతక్కకు వెన్ను దన్నుగా ఉండి అధిక మెజార్టీతో గెలిపించుకున్నారని గుర్తు చేశారు. కేవలం గిరిజనులను దృష్టిలో పెట్టుకుని పోడుభూముల సమస్యపై మాత్రమే హైదరాబాద్ మీటింగ్లో ప్రస్తావించి దళితుల సమస్యలను విస్మరించడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ములుగు నియోజకవర్గం నుంచి రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై దళిత సమాజాన్ని పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో కేవలం పోడుభూముల సమస్య ఒక్కటే లేదని అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల సమస్యలు, రైతు సమస్యలు, అర్హులందరికి త్వరితగతిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై మాట్లాడిన, ప్రభుత్వ కార్యక్రమాలలో మాట్లాడినా కేవలం గిరిజనులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడక సబ్బండ వర్గాల అభివృద్ధికి తోడ్పడే విధంగా మాట్లాడడం మంచిదని ములుగు జజిల్లా మాల మహానాడు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళిత, గిరిజన మరియు గిరిజనేతరులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కేవలం గిరిజనులకే ఎమ్మెల్యే కాదన్నారు. ములుగు ఎమ్మెల్యే ఆత్మ విమర్శ చేసుకోవాలని ఏజెన్సీలోని దళితుల గురించి మాట్లాడ నట్టైతే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Post A Comment: