మన్యం టివి, అశ్వాపురం:జీవాలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పశు వైద్యాధికారి, సిబ్బంది సూచనలు పాటిస్తూ రక్షించు కోవాలని జడ్పీటీసీ సభ్యురాలు సూదిరెడ్డి సులక్షణ గోపాలకృష్ణారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆనందా పురం గ్రామం లో పశు వైద్యాధికారి సరస్వతి ఆధ్వర్యంలో ఆదివారం గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంకు జడ్పీటీసీ ముఖ్య అతిథిగా హాజరై నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ఈ కార్యక్రమంను మండలంలోని జీవాల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, స్థానికులు, జీవాల పెంపకం దారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: