CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

Share it:

 



రూ.60,06,960 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ: మణుగూరు ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ నాయకులు

మన్యం మనుగడ, మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరు ఐన కళ్యాణ లక్ష్మీ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు,అధికారులు మొత్తం 60 మంది లబ్ధిదారులకు రూ.60,06,960 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ పొశం.నర్సింహారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పధకం ద్వారా పేద ఇంటి ఆడపిల్లల కు కానుకగా రూ.1,00,116 చెక్కును కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది అన్నారు.దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారు అని అన్నారు.సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.ఈ సందర్భంగా చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ,సీఎం కేసీఆర్ కు,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు, ఎంపీపీ కారం.విజయ కుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు, జూనియర్ అసిస్టెంట్ ముద్దరాజు,సర్పంచ్ బచ్చల.భారతి,కాయం.తిరుపతమ్మ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,ఉప సర్పంచ్,పుచ్చకాయల. శంకర్,మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు మాదాడి. రాజేష్,మహిళ కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: