మన్యంటీవీ, అశ్వారావుపేట:అశ్వారావుపేట నియోజకవర్గ వైయస్సార్ తెలంగాణ పార్టీ కో కన్వీనర్ సోయం వీరభద్రం సోమవారం అశ్వారావుపేట మండలం లో పలు గ్రామాల్లో పర్యటించారు. తిరుమల కుంట గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వీర విధేయుడిగా ఉండి జగనన్న కోసం అహర్నిశలు కష్ట పడిన మోదుము పరపు శ్రీనివాస్ ఇటీవల అనారోగ్య కారణాల వలన కాలం చేసిన కారణంగా వారి కుటుంబాన్ని ఓదార్చి, కుటుంబ సభ్యులను సోయం వీరబద్రం పరామర్శించారు. అదేవిధంగా తిరుమలకుంట గ్రామానికి చెందిన కందుకూరి శ్రీను కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం కల్పించడం జరిగింది. వారి కుటుంబంలో వెంటవెంటనే తండ్రిని, తమ్ముడు మల్లికార్జునని కోల్పోయిన శ్రీనుని మరియు మల్లికార్జున కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం కల్పించారు. వారికీ వైయస్సార్ తెలంగాణ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట మండల నాయకులు రెడ్డి మల్ల రాజు, రమేష్, జోగారావు, యాకోబు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: