ఈ సారి చావో రేవో తేల్చు కుంటాం
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ మూత పడి సంవత్సరాలు గడుస్తున్న ఫ్యాక్టరీ లో పని చేసి ఇప్పుడు రోడ్డున పడ్డ కార్మికులను ప్రభుత్వం పట్టించుకున్న పాపానా పోలేదు. ఈ సందర్బంగా బిల్ట్ కార్మికులందరు దీక్షలోకూర్చొని ఈ సారి మా సమస్యకు పరిస్కారం ఎలా లభించదో మేము చూస్తాం చావో రేవో తేల్చుకుంటాం అంటూ దీక్షలోకూర్చొని కార్మికులు అందరు ఒకటే మాటమీద ఉండి తమ సమస్యలకు పరిష్కరించాలని దీక్షభూనారు.ఈ సందర్బంగా బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికులు మాట్లాడుతూ
గత 72నెలల నుండి జీతాలు లేవు.64 నెలల నుండి పీఎఫ్ డబ్బులు పంపలేదు అందువలన ఏప్రిల్ 2021నుండి రిటైర్డ్ అయిన కార్మికులకు పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. మా పరిస్థితి రోజు రోజుకు విషమిస్తుంది. ఎన్ సి ఎల్ టి కోర్ట్ ఆరు నెలల లోనే బిల్ట్ కార్మికుల సమస్య కు పరిష్కరించాలి కానీ సంవత్సరం గడిచి ఆరు నెలలు దాటిన కూడా మా సమస్య కు ఇంత వరకు ఒక పరిస్కారం లభించలేదు. తెలంగాణ ప్రభుత్వం మా బిల్ట్ కంపెనీకి 327 కోట్లు ప్రకటించిన విషయం విదితమే కానీ ఇంత వరకు ఒక్క నయాపైసా కూడా కార్మికులకు అందలేదు. అందుకని బిల్ట్ కార్మికులు అందరం చావో రేవో తేల్చుకోవడానికి కమలాపురం బిల్ట్ మెయిన్ గేట్ ముందు 14-08-2021శనివారం రోజున ఉదయం 8 గంటలకు దీక్ష చేపట్టడం జరిగింది అని ఈ సందర్బంగా బిల్ట్ కార్మికులు పత్రికాముఖంగా తెలియజేసారు. ఈ కార్యక్రమం లో లింగంపల్లి శ్రీనివాసరావు, తాడల్లా దుర్యోదనా, కే వెంకటాచారి, జీవీ కృష్ణ, పి రాజకుమార్, తదితర బిల్ట్ కార్మికులు పాల్గొన్నారు.
Post A Comment: