మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ గ్రామానికి చెందిన తెల్లబోయిన కళ్యాణ్ (23) ఆదివారం రోజున ఐదుగురు మిత్రులతో కలిసి బయ్యారం పెద్ద చెరువు దగ్గరకు వెళ్లి ఈత కొడదామని చెరువులో దిగి మునిగిపోయాడు. తోటి మిత్రులు చూసి కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది అప్పటికే గల్లంతు అయ్యి చెరువులో మునిగి పోయాడు. సమాచారం అందుకున్న బయ్యారం పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చిన స్థానికులు సహాయంతో చేపట్టారు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో కళ్యాణ్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సిఐ తిరుపతి ఎస్ఐ రవి గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహం బయటకు వేలపడింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Post A Comment: