మన్యం టీవీ, అశ్వాపురం:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అశ్వాపురంనకు చెందిన విద్యార్ధులు కన్నెకంటి కార్తీక్ s/o లక్ష్మణాచారి,లింగంపల్లి సాయిసుజిత్ s /o నాగేశ్వరరావు 2021-22 విద్యా సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక బాసర ఐ ఐ ఐ టి నందు సీటు సాధించారు.అలాగె కన్నెకంటి కార్తీక్ మేధా ఎడ్యుకేషన్ సొసైటీ వారు నిర్వహించిన స్కాలర్ షిప్ పరీక్షలో కూడా అర్హత సాధించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ బాసర ఐ ఐ ఐ టి నందు సీటు సాధించిన విద్యార్దులను మరియు వారికి తోడ్పాటు అందించిన పాఠశాల ఉపాద్యాయులను ఎంపీపీ ముత్తినేని సుజాత అభినందిస్తూ వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లి తండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రదానొపాద్యాయులు శ్రీనివాసరావు,ఉపాద్యాయు లు నాగభూషణం,శాస్త్రి,శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: