CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Share it:

 


*మన్యం టీవీ ఏటూరు నాగారం

దివంగత నేత,భారతరత్న అవార్డు గ్రహీత,మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం కాంగ్రెస్ మండల మండల అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భముగా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు ఇర్శవడ్ల వెంకన్న హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భముగా వెంకన్న,చిటమట రఘు మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ 1944 ఆగ‌స్టు20 బోంబేలో జ‌న్మించారు.భార‌త‌దేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయ‌న తాత జవహర్ లాల్ నెహ్రూ ప్ర‌ధాన‌మంత్రి అయ్యేనాటికి రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్స‌రాలు,తండ్రి ఫిరోజ్ గాంధీ పార్ల‌మెంటు స‌భ్యుడుఅయ్యారు.నిర్భ‌యంగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే పార్ల‌మెంటేరియ‌న్‌గా పేరు తెచ్చుకున్నారు.1980లో సోద‌రుడు సంజ‌య్‌గాంధీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో ప‌రిస్థితి మారింది.అప్ప‌ట్లో అంత‌ర్గ‌తంగా,బ‌హిర్గ‌తంగా అనేక స‌వాళ్ళు చుట్టుముట్టిన ప‌రిస్థితుల్లో త‌ల్లికి చేయూతను ఇవ్వ‌డానికి రాజ‌కీయాల్లో చేర‌వ‌ల‌సిందిగా రాజీవ్‌గాంధీపై వ‌త్తిడి పెరిగింది.మొద‌ట్లో వీటిని ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ త‌రువాత త‌ల వొగ్గ‌క త‌ప్ప‌లేదు.త‌మ్ముని మృతి కార‌ణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాజీవ్‌గాంధీ గెలుపొందారు అని అన్నారు.

ఆధునిక భావాలు, నిర్ణ‌యాత్మ‌క శ‌క్తి క‌లిగిన రాజీవ్‌గాంధీ అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞాని అని ప్ర‌పంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.త‌న ప్ర‌ధాన ఆశ‌యాల‌లో భార‌త ఐక్య‌త‌ను ప‌రిర‌క్షిస్తూనే దేశాన్ని 21వ శ‌తాబ్దంలోకి తీసుకువెళ్ళడం ముఖ్య‌మైన‌ద‌ని రాజీవ్ ప‌దేప‌దే చెబుతూండేవారని అన్నారు.భారత దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాడని రాజీవ్ గాంధీ ని కొనియాడారు. 1991,మే21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబాదుర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌టిటిఇ తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించాడు.యావత్ దేశం అభిమానించే రాజీవ్ గాంధీ చనిపోయిన నాటినుండి మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించబడింది అని అన్నారు.కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్ స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, వావిలాల ఎల్లయ్య,వావిలాల నర్సింగరావు,ఎండి ఖలీల్ ఖాన్. సీతక్క యువ సేన అద్యక్షుడు ఎండీ గౌస్, పెద్దబోయిన నర్సింగరావు, ముక్కెర లాలయ్య,సప్పిడి రాము,తాజ్,సులేమాన్,జియా రియాజ్,బాబా,మాడుగురి ప్రసాద్,గారా పోషలు టాన్ అధ్యక్షడు తల్లపల్లి నర్సింహులు,ఎండి నజీర్,తదితర నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: