మన్యం టీవీ కరకగూడెం: మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, రక్షక భటుల నిలయం,తహశీల్దారు,కార్యాలయం, మండల ప్రజాపరిషత్ కార్యాలయం,హాస్పిటల్ గ్రామపంచాయతి భవనాల యందు 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరగూడెం ఎంపీపీ రేగా కాళికా, తహశీల్దారు శివయ్య డాక్టర్ పర్షియా నాయక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ గ్రామపంచాయతిల సర్పంచ్ లు,సెక్రటరీ లు,ఉపాధ్యాయులు జాతీయ జెండా ఎగురవేశారు.అనంతరం వారు వేరువేరుగా మాట్లాడుతూ.ఎందరో త్యాగధనులు ప్రాణ త్యాగ ఫలం,నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అని,బ్రిటిష్ పాలన నుండి మన దేశానికీ స్వాతంత్ర్యం సాధించడం జరిగిందన్నారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు కోల్పోయారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు గొగ్గలి నాగమణి, జవ్వాజి రాధ పాయం నర్సిహరావు పోలెబోయిన శ్రీవాణి తాటి సరోజినీ ఉపాద్యాయులు, పోలిస్ సిబ్బంది గ్రామపంచాయతి సెక్రటరీ లు పాల్గొన్నారు.
Post A Comment: