మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలోని కూనవరం గ్రామ పంచాయతీలో మారుమూల గ్రామమైన రేకుల గండి లో మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు హెల్త్ క్యాంపు నిర్వహించి, మందులు ఇవ్వడం జరిగింది.సీజనల్ వ్యాధులు ఐన మలేరియా,డెంగ్యూ, మెదడువాపు,విష జ్వరాలు వస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. దోమలను తెరలను ఉపయోగించుకోవాలని, ఇంట్లో గల కంటైనర్ లను పరిశీలించి వాటిలో ఉన్న లార్వా కంటైనర్లను తొలగించి,అనంతరం రేకుల గండి చెరువులో గంభూసియా ఫిష్,దోమ గుడ్లును,లార్వాలను తినే ఫిష్ ను వదలడం జరిగింది. అదేవిధంగా మణుగూరు చెరువు,మార్కెట్ చెరువు లలో ఫిష్ లను వదలడం జరిగింది.అనంతరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు నందు లతో ఏఎన్ఎం లతో సమీక్ష సమావేశం నిర్వహించి,తగు సూచనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనిక.ప్రసాద్,డాక్టర్ మౌనిక,సిహెచ్ఓ,వెంకటేశ్వరరావు,హెచ్ఈఓ కృష్ణయ్య, ఎస్ యు ఓ.లింగ్య నాయక్, పి హెచ్ ఎన్ స్వర్ణలత,హెచ్ ఎస్ ధన లక్ష్మి,రాంప్రసాద్, ఉమేష్,విజయ,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: