CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి

Share it:

 


👉ఆదివాసుల ప్రాణాలు జ్వరాలతో గాలిలో కలుస్తున్నా పట్టించుకోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

👉 ప్రైవేటు వైద్య దోపిడి తో అప్పుల ఊబిలో గిరిజనులు

👉జిల్లా తుడుందెబ్బ ప్రచార కార్యదర్శి ఆలెం కోటి

మన్యం మనుగడ, మణుగూరు:

ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం లోని అన్ని గ్రామాలలో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తుడుము దెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి ఆలెం కోటి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మణుగూరు లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు .ఇటీవలి కాలంలో డెంగ్యూ మలేరియా విషజ్వరాల మూలంగా అనేకమంది గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిసిన పట్టించుకోవాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిద్ర మత్తులో జోగుతున్నారన్నారు. ప్రజలు రోగాల బారిన పడి అనేక అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు .పారిశ్రామిక జిల్లా అయినా భద్రాద్రి కొత్తగూడెం నుండి వందల కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం దారుణమన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో గిరిజనులు ప్రైవేటు వైద్యం ఆశ్రయించడంతో లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు .దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు వైద్యశాలలో పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Share it:

Post A Comment: