CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేటి యువత కు స్ఫూర్తి దాయకమైన బయోపిక్ చిత్రం : దర్శకులు పరమేశ్వర్

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నేటి యువత, సమాజానికి స్పూర్తిదాయకమయిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ చిత్రం తెరకెక్కించడం జరుగుతుందని చిత్ర దర్శకులు పరమేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పెన్షనర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందు నియోజక వర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాధారణ జీవనం గడుపుతున్నారు గుమ్మడి జీవిత చరిత్ర ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఒక సారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే హంగు ఆర్భాటాలు, అధికారంతో రూపాయలు కోట్లు సంపాదించుకున్నారని తెలిపారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కానీ సైకిల్ పై తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆటోలో అసెంబ్లీ కి వెళ్లిన వ్యక్తి గుమ్మడి నర్సయ్య అని కొనియాడారు. ఇప్పటికీ తన పొలం పనులు చేసుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీవితాన్ని, ప్రస్తుతం తనకు వచ్చే పెన్షన్ కూడా పార్టీకి ఇవ్వడం గుమ్మడి గొప్పతనం అని అన్నారు. ఇంకా కొంచెం షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందని త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. మంచి సాంకేతిక నిపుణులతో చిత్రీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇల్లందులో 40 శాతం షూటింగ్ ఉంటుందని, మిగిలిన సన్నివేశాలను హైదరాబాద్ పాటు ఇతర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల ఆధార అభిమానులతో చిత్రం విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చిత్రయూనిట్ సభ్యులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: