సీఎంఆర్ఎఫ్ పేదలకు పెన్నిది:ఎంపీపీ రేగా కాళిక
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు పెన్నిదిలా మరిందని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
కరకగూడెం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు 10 మంది లబ్ధిదారులకు రూ.2లక్షల,38వెయ్యిల,500రూపాయలు విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక,టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య చేతులమీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ...అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి,వేలు ఖర్చు చేసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి కొండంత అండనిస్తోందని ఆమె వివరించారు.
ఆర్థిక సహాయం అందుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్,ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,గ్రామ కమిటి అధ్యక్షులు చిట్టి సతీష్,రావుల రవి,పోగు వెంకటేశ్వర్లు,బుడగం రాము,యలిపెద్ది శ్రీనువాసు రెడ్డి,కొమరం రాంబాబు,సారా సాంబయ్య,రేగా సత్యనారాయణ,బాలయ్య,శ్రీకాంత్,సర్పంచులు పాయం.నర్సింహారావు,కొమరం విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: