CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మండల ఎంపిపి గుమ్మడి గాంధీ

Share it:

 



మన్యం మనుగడ, పినపాక : 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం,వారి కుమార్తెల వివాహం నిమిత్తం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకానికి అర్హులైన పినపాక మండలం లోని 38 కుటుంబాల లబ్ధిదారులకు చెక్కులను పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం కారణంగా, అనేక పేద కుటుంబాల వారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతున్నాయి అని, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసే ఈ సమయంలో వారి ఆనందాన్ని వ్యక్తిగతంగా గమనించానని, ఇంత మంచి పధకాన్ని ప్రవేశ పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, తాహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ గాంధీ, ఆర్ ఐ వీరభద్రం, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, గడ్డం పల్లి సర్పంచ్ సునీల్ కుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: