మన్యం మనుగడ కరకగూడెం: 182 వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు కరకగూడెం,పినపాక మండలాల ఫోటోగ్రాఫర్స్ అసోషియేషన్ అధ్యక్షులు గుమ్మడివెల్లి ప్రసాద్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కరకగూడెం నుండి ప్రభుత్వ వైద్యశాల వరకూ బైక్ ర్యాలీ నిర్వహించి హాస్పిటల్ లో రోగులకు పండ్లు,బ్రెడ్,పంపిని చేశారు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో గ్రాఫర్లకి ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాపర్ల జిల్లా గౌరవ అధ్యక్షులు గుణగంటి సారయ్య మాట్లాడుతూ ప్రతి ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకొవలని కోరారు.ఫోటోగ్రాఫర్ లు ఎదైనా ప్రోగ్రామ్ కి వెళ్లినప్పుడు ఐడి కార్డు కలిగి ఉన్నా వారు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కీసర సుధాకర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి సిరిశెట్టి కమలాకర్ కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి ఫోటోగ్రాఫర్ జిల్లా కమీటీ సభ్యులు పూజారి క్రిష్ణ ఫోటోగ్రాఫర్ లు విష్ణు, దిలీప్,కార్తీక్, గంగాధర్,రాజేందర్,మహేష్, జే ప్రకాశ్, మోహంత్ ,సాంబ,రామ్మోహన్, సాయి,బి.ప్రకాశ్, నవీన్ ,పినపాక ,కరకగూడెం మండలాల ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు.
Post A Comment: