మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలో డి ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన 182వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రామప్ప ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కు హాజరై మాట్లాడుతూ ముందుగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఎన్నో విలువైన జ్ఞాపకాలను ఇప్పటికీ,ఎప్పటికీ ఏ నాటికి నిలిచి ఉండేదే ఫోటో అని తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర చాలా గొప్పది అని ఢిల్లీకి వినిపించేలా సమస్యలను నాయకులకు వాస్తవ చిత్రాలను వార్తలు రాసి ఫోటోలు తీసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఫోటోగ్రాఫర్ల పాత్ర చాలా గొప్పది అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ గారి తో కలిసి పని చేసే క్రమంలో ఫోటోలు దిగాలి అనే ఆలోచన ఉండేది కాదు అని ఇప్పుడు ఫోటోలు లేక బాధపడుతున్నాని అని అన్నారు.మాజీ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒకపక్క కేసిఆర్ గారి పోరాటానికి మీ జర్నలిజం చాలా మేరకు ఉపయోగపడిందని అన్నారు. అనంతరం ఫోటో గ్రాఫర్స్ అతిధులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ ప్రేమ లత, సబ్ రిజిస్టార్ తస్లీమా,తెరాస నాయకులు కోరిక గోవింద నాయక్, మడుగుల రమేష్,కూరెల్ల రామాచారి మురహారి బిక్షపతి, పిన్నటి మధుసూదన రెడ్డి, అశోక్,నర్ర భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: