CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యుత్త్ షాక్ వలన వ్యక్తి మృతి

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: రాజాపురం గ్రామానికి చెందిన చింతల రాజు(32 సం") అనే వ్యక్తి విద్యుత్త్ షాక్ వలన మరణించాడు. ఎర్రగుంట గ్రామంలోని రైస్ మిల్ దగ్గర బిల్లింగ్ పనుల నిమిత్తం పనికి వెళ్లి, విద్యుత్త్ బ్రేకర్ వస్తువుతో పనులు చేస్తున్న సమయంలో బ్రేకర్ వైరు జాయింట్ తగలడంతో విద్యుత్ షాక్ కు గురైయ్యాడు. సహచరుల సహాయంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుపోగా అప్పటికే మరణించాడని, పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తీసుకుపోయారు అని, గ్రామస్తులు, బంధువులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు, పిల్లలు ఉన్నారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

Post A Comment: