మన్యం టీవీ, అశ్వరావుపేట అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దంపట్టే రాఖీ పండుగ వేడుకలు మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా అహర్నిశలు ప్రజాసేవలో మమేకం అవుతున్నా రక్షకభటులకు రాఖీ కట్టాలని ఉద్దేశంతో ఎంపిటిసి వేముల భారతి అశ్వరావుపేట రక్షకభట నిలయం సీఐ కార్యాలయంలో సిఐ ఉపేంద్రకు రాఖీ కట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ ఉపేంద్ర కుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణ పట్ల ప్రతి అన్నా, తమ్ముడు ఒక రక్షకభటుడులా నిలవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Post A Comment: