👉 సిపిఐ【 ఎంఎల్ 】 న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి :: అన్నపురెడ్డిపల్లి మండలంలోని కట్టుగూడెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం అటవీ ప్రాంతంలో మరణించిన భాగం వెంకటేశ్వరరావు, కుటుంబాన్ని సిపిఎం (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పరామర్శించి, వెంకటేశ్వరరావు మరణం పట్ల సానుభూతి తెలిపి నివాళులర్పించారు. అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల ప్రజలు పై మరియు పోడు సాగుదారులపై అటవీశాఖ అధికారుల దాడులు రోజు రోజుకి పెరిగి పోతున్నాయని, భాగం వెంకటేశ్వరరావు మరణానికి కారణమైన అటవీ శాఖ అధికారి పై హత్య నేరం కేసు నమోదు చేయాలని, వెంకటేశ్వరరావు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించి, వారి కుటుంబానికి 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, పేద రైతు అయిన భాగం వెంకటేశ్వరరావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు మండలంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని దశలవారీగా ఆందోళన చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు ఎస్కే ఉమర్, డివిజన్ నాయకుడు కందగట్ల సురేందర్, సబ్ డివిజన్ నాయకుడు వరికూటి వెంకట్రావు, పద్దం వెంకన్న , తాటి సీతారాములు, భూక్య వింట్టు, తదితర నాయకులు ఉన్నారు.
Post A Comment: